బాబు వ్యాఖ్యలపై రాజకీయ చర్చ:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు… ఆంధ్రప్రదేశ్లో మరో ప్రజాఉద్యమం రావాలని.. దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందన్నారు. ఇక, ఈ పోరాటంలో తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అన్నారు చంద్రబాబు. ఈ వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాలలో చర్చలు మొదలయ్యాయి. జనసేనతో పొత్తులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి తెచ్చాయి.
సేవ్ ఆంధ్రప్రదేశ్’ : రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. తమపై కేసులు పెడితే భయపడమని.. ప్రజాసమస్యలపై తిరుగులేని పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర పరిస్థితి చూసి బాధ, ఆవేదన కలుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్రాన్ని కాపాడటానికి అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘‘నిన్న ముగ్గురు ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. హోంశాఖ మంత్రి తల్లుల పెంపకంపై మాట్లాడటం సిగ్గుచేటు. సజ్జల రాసిన స్టేట్మెంట్లను ఆమె చదువుతున్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవడానికి అందరూ ఉద్యమించాలి. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు సంపాదించే అవకాశం కల్పిస్తే.. జగన్ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి యువకులను రూ.5వేల జీతాలకే పరిమితం చేస్తున్నారు…. రాష్ట్ర భవిష్యత్ను జగన్ అంధకారం చేస్తున్నారు. కరెంట్ బిల్లులను 40 శాతం పెంచారు. .. అని చంద్రబాబు మండిపడ్డారు. కాకినాడ జిల్లాలో చంద్రబాబు బాదుడే..బాదుడు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.