ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఊపిరి వంటిదని, కానీ తల్లి లాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు పొడిచారని వైస్ షర్మిల విమర్శించారు. ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్ వారసుడు ఎలా అవుతాడని అని ప్రశ్నించారు. తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది వ్యక్తిగత కారణాలతో కాదన్నారు. అలాగైతే 2019లోనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఉండేదాన్నని వివరించారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ… ఆయన మాట వల్లే తాను రాజకీయాల్లో ప్రవేశించానని షర్మిల తెలిపారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని షర్మిల వ్యాఖ్యానించారు. ఏపీకి మోదీ ఏం చేశారని, మోదీ అంటే తనకు గౌరవం అని పవన్ అంటున్నారు అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు లేరు కాబట్టే తాను ప్రజల కోసం వచ్చానని స్పష్టం చేశారు.