జనసేనాని పవన్ క్యలాణ్ భద్రతా సిబ్బందిని, జనసేన టీమ్ లను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ప్రతిపక్షాలను పోలీసులతో భయపట్టాలనే ప్రయత్నాలు సఫలం కావని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. చిలకూలూరిపేటలో ఈ నెల 17న టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని వెల్లడించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడితో కలిసి మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రెండు పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
10 లక్షల మందితో చిలకలూరిపేట సభను నిర్వహిస్తామని చెప్పారు. ఆ సభలో అందరూ భాగస్వాములు కావాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. ఆ సభలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడటం దారుణమని వాపోయారు.