వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అతడి తండ్రి భాస్కర్రెడ్డిలకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇంకా అసలు విషయాలు బయటకు రావాలంటే నిందితుడు సునీల్ యాదవ్కు బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.
వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు సునీల్ యాదవ్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం. వివేకా హత్య ప్రణాలికను అవినాష్ ఉద్దేశ పూర్యకంగా దాచేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ స్పష్టం చేసింది. హత్య జరిగిన స్థలం నుంచే అవినాష్ రెడ్డి ఓ నెంబర్ కి ఫోన్ చేసి నాలుగు నిమిషాలు మాట్లాడినట్లు సీబీఐ పేర్కొంది. ఇంకా అనేక అంశాలను సీబీఐ కోర్టుకి సమర్పించింది.
చంద్రబాబుపై నెపం రాజకీయ వ్యహంలో భాగమేనా? వివేకా హత్యను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై నెట్టడానికి జగన్, అండ్ కో ప్రయత్నించడం రాజకీయ వ్యూహంలో భాగంగానే చెపుతున్నారు.