పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద (చిలకలూరిపేట సమీపంలో) ఎన్డీయే కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజాగళం సభ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ ప్రసంగాల సమయంలో ఉత్సాహం కనిపించిందని వారితో చెప్పారు. ఎన్డీయే కూటమి ఘనవిజయంలో మీ పాత్ర కూడా ఉండాలి.. ఉంటుంది.. అందుకు నిదర్శనమే ఈ సభ.. అంటూ మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు అరెస్ట్, ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. ఇక, ఏపీలో రాజకీయ పరిస్థితులను ప్రధానికి చంద్రబాబు, పవన్ భ్రీఫ్ చేసారు. ఏపీలో వ్యవస్థల విధ్వంసం జరుగుతోందంటూ పలు అంశాలపై పవన్ కల్యాణ్ మోడీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీటిపై సమయం ఆసన్నమైనపుడు చర్యలు తీసుకుందాం.. అంటూ మోదీ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
”ఇసుకలో 40 వేల కోట్ల దోపిడీ, మద్యం అమ్మకాలలో నగదు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిపడటం ద్వారా, మైన్స్ దోపిడీ, బాక్క్సయిట్ అక్రమ తవ్వకాల ద్వారా నెలకి 5 వేల కోట్ల అక్రమ ఆర్జన … ఈ ఐదేళ్లలో జగన్ మరోమారు.. లక్షల కోట్లు దోచుకున్నారని, ఆ సొమ్ములో కొంత ఎన్నికల్లో జనానికి పంచి..మరోమారు అధికారంలోకి రావడానికి సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నట్లు ”పవన్, చంద్రభాబు.. ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.