వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంలో సోషల్ మీడియా ద్వారా రచ్చకెక్కడం తెలిసిందే. దీనిపై MP మాధవ్ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లతో పాటు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధా కృష్ణపై బూతులు లంకించుకున్నారు. మాధవ్ తనపై అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని రాధాకృష్ణ నోటీసు ఇచ్చారు. దీనిపై ABN ఎండీ ఆర్కే .. తన పరువుకు భంగం కలిగించినందుకు గోరంట్ల మాధవ్ పై రు 10 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు. ఈ మేరకు నోటీసులు కూడా పంపారు. ఈ విషయాన్ని ABN ఛానల్ ద్వారా చెప్పారు.