వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, , బీఆర్ఎస్ తెరవెనుక స్నేహితులే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పదేళ్ల క్రితం ఉన్న టీఆర్ఎ్సగా ఉన్న పార్టీ నేడు బీఆర్ఎ్సగా మారిందని.. మిగులు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ ఘనత సీఎ కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఏపీని కూడా అప్పుల రాష్ట్రంగా చేశారన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పాటైన తెలంగాణను.. రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి కేసీఆర్ కుటుంబం జేబులు నింపుకొందని పురందేశ్వరి విమర్శించారు. నీళ్లు, నియామకాలు, నిధులపై అడిగితే కేంద్రంపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. రూ.1.35 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కేసీఆర్ అవినీతితో పనికిరాకుండా పోయిందన్నారు. హైదరాబాద్ లో ఒక సామాజిక వర్గ ఆత్మీయ సమావేసంలో పాల్గొన్న సందర్బంగా పురందేశ్వరి పై విధంగా స్పందించారు.