ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతితో మంత్రులు పోటీపడుతున్నారు. ఏపీలో అవినీతి సర్కార్ ను సాగనంపాలి… అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ”ప్రజా గళం” సభలో మోడీ జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… జగన్ మూడు ముక్కలాట పేరుతొ అమరావతిని భ్రష్టు పెట్టించాడని మండిపడ్డారు. పోలవరాన్ని జగన్ గోదావరిలో కలిపేశారన్నారు.
చంద్రబాబు ప్రసంగంలో కీలక అంశాలు…
-
- సహజ వనరులను దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ పేరుతో జగన్ దోచేశారు.
- గంజాయి, అశాంతితో రాష్ట్రాన్ని నాశనం చేశారు.
- జగన్ రక్త దాహానికి చిన్నాన్న చనిపోయాడు. ఇద్దరు చెల్లెల్లు జగన్కు ఓటెయ్యోద్దు అన్నారు
- ప్రధానిని కోరుతున్నా.. ఏపీ చాలా ఇబ్బందులు పడుతోంది.
- కలెక్టరేట్ ఆఫీసు, రైతు బజార్ బిల్డింగ్ లాంటివి కూడా తనఖా పెట్టేసారు
- మద్యం ఆదాయాన్ని ముందుగానే తనఖా పెట్టి ఎస్క్రో చేశారు
- ఎన్డీఏకు 400 సీట్లు పైన వస్తాయి. ఏపీలో 25కు 25 సీట్లు గెలిపించాల్సింది మీరే..
- జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ”2014 లో తిరుపతి బాలాజీ సమక్షంలో ఈ పొత్తు ప్రారంభం అయింది. ఇపుడు దుర్గమ్మ సాక్షిగా పొత్తు మళ్ళీ మొదలయింది… ”అని పవన్ ఉద్వేగంగా చెప్పారు. 2024 లో దుర్గమ్మ తల్లి అశీసులతో ప్రభుత్వం స్థాపిస్తున్నామని పవన్ చెప్పారు. మోడీ దేశాన్ని ముందుకు తీసుకువెళుతుంటే.. డిజిటలైజ్ చేస్తుంటే.. ఆంధ్రాలో మాత్రం.. క్యాష్ చేసుకుంటున్నారు…
- జగన్ ముఖ్యమంత్రి కాదు.. సారా వ్యాపారి.. అని పవన్ తీవ్ర ఆరోపణలు చేసారు. ”రావణాసురుడిని సంహరించిన రాముడికి అయోధ్యలో గుడి కట్టిన మోడీ.. ఆంధ్రాలో రావణాసురుడి వంటి జగన్ ను చిటికన వేలితో పెకలించడం పెద్ద .పని కాదు. ఇసుకలో 40 వేల కోట్లు దోచిన జగన్ కి వెళ్లిపోయే రోజు వచ్చింది.. ” అని పవన్ పేర్కొన్నారు.