అల్లూరి సీతారామరాజు జిల్లా
నూతనంగా జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ అల్లూరి జిల్లా పాడేరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఉండాల్సిన మందులు లేవు. అసలే సీజనల్ వ్యాధులు విజృంభించే కాలం కాని మౌలికంగా ఉండాల్సినవే అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నపిల్లలకు వేసే పారాసిటమాల్ 100ఎంజీ ఇంజక్షన్ లేకపోవడం చాలా దుర్మార్గమంటున్నారు గిరిజనులు. అలాగే సీబీసీ, హెచ్ బీ, టెస్టులు కూడ చేయలేని స్థితిలో పాడేరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉందని వాపోతులన్నారు. ఇటీవల రక్త హినతతో బాధపడుతూ హాస్పిటల్ కు వస్తున్నారు చిన్నారులు. వారికి చీకిల్ సెల్ ఎనిమియాకు టెస్టు చేయాల్సిఉంది. ఆ టెస్ట్ లు కూడా చేయడం లేదు.
దారెల పంచాయతీకి చెందిన వంతల గాయత్రి ముంచంగిపుట్టు పాఠశాలలో చదువుతోంది. ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పాడేరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు సీబీసీ, హెచ్ బీ, టెస్టులు చేయాల్సి ఉంది. ఆటెస్ట్ కూడా చేయలేదని ఆమె బంధువులు వాపోతున్నారు. మరో సమస్య ఏమిటంటే చికిల్ సెల్ ఎనీమియా ఉన్న వారికి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తేనే భవిష్యతులో పింఛను ఇచ్చే పరిస్తితి ఉంది. దీంతో ప్రైవేటు వైద్యం చేయించుకోలేక.. ఇటు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందక ఏజెన్సీ చిన్నారులు సతమతమవుతున్నారు.