ఓ క్రికెటర్ వైసీపీలోకి వస్తానంటే.. ఎంతిస్తావని అతడ్ని అడిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు.
టీడీపీ హయాంలో అభివృద్ధి కోటగా ఉన్న శృంగవరపుకోటను అవినీతి కోటగా మార్చేశారని విమర్శించారు. విశాఖలో జగన్ రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటుంటే, ఇక్కడి ఎమ్మెల్యే రూ.50 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నాడని ఆరోపించారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.