ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో.. ఇంటికి కిలో బంగారమిచ్చినా జగన్కు ఓటమి తప్పదని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం… జగన్ ను శాశ్వతంగా ఇంటికి పంపాలని భావిస్తున్నారన్నారు. చీప్ ట్రిక్స్తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారన్నారని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో (Elections) ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి చెందిన గోడౌన్లో రాష్ట్ర వ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్ను అధికారులు పట్టుకున్నారని నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ (YSRCP) తాయిలాల డంప్నైతే పట్టుకున్నారన్నారు. మరి ఇసుక, లిక్కర్లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్ను ఎప్పుడు పట్టుకుంటారని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజి బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోందన్నారు.