ఇటీవల ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, సీఎం జగన్ వరుసగా మోదీ, అమిత్ షాను కలవడంతో రాజకీయ వాతావరణం రంజుగా మారింది. టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు గురించే చంద్రబాబు కలిసినట్టు చర్చజరుగుతోంది. ఆ వెంటనే జగన్ బీజేపీ అగ్రనేతలను కలవడం వైసీపీతో బీజేపీ కుమ్మక్కైందా.. అనే అనుమానాలకు తావిస్తోందని పలువురు అంటున్నారు. టీడీపీతో చేతులు కలపొద్దని జగన్ ప్రధాని మోదీతో పాటు బీజేపీ నాయకులను కోరినట్లు రాజకీయ వర్గాలు పుకార్లు పుట్టిస్తున్నాయి.
ఈ పరిస్థితిని బ్రేక్ చేస్తూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై తమ పార్టీ పోరాడుతోందని గుర్తుచేశారు. వైసీపీతో బీజేపీ కుమ్మక్కై ఉంటే తామెందుకు పోరాటం చేస్తామని ప్రశ్నించారు. సీఎం హోదాలో జగన్, రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిశారని, రాష్ట్రం గురించి చర్చించారని అన్నారు.