“తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది కదా. ఆదాయం కోసం ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా? తెలంగాణ ను ఏపీలో కలిపేస్తారా?” అని ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకేయ దుమారం రేపుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు, విలీన మండలాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అని ప్రశ్నించారు. పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు బొత్స వద్ద ప్రస్తావించగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు విషయం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే అందరికీ తెలుసన్నారు.
అజయ్.. నీ సంగతి చూసుకో., మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి. సమస్యను పరిష్కరించుకునేలా ఉండాలి తప్ప.. రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదు. పువ్వాడ అజయ్… మీ సంగతి మీరు చూసుకోవాలి. ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల సంగతి ఆయన చూసుకుంటే సరిపోతుంది. ముంపు మండలాలు, ప్రజలు ఏపీ రాష్ట్ర కుటుంబసభ్యులు. ఆ ప్రజల బాధ్యత పూర్తిగా మాది. విలీన మండలాలను తెలంగాణలో కలిపేయాలని వాళ్లు అంటే.. రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలని మేం కూడా డిమాండ్ చేస్తాం’’ అని బొత్స ఘాటుగా వ్యాఖ్యానించారు.