” మోడీ సర్కార్ పై కాంగ్రెస్ ఆద్వర్యంలోని ‘ఇండియా’ కూటమి అవిశ్వాసం ప్రకటించిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఎన్ డీయే కి మద్దుతు ప్రకటించడం తెలిసిందే. బయటకి బీజేపీ, వైసీపీ విమర్శలు చేసుకుంటున్నా,. లోపాయికారి ఒప్పందాలు మాత్రం కొనసాగుతాయి..” ఈ నేపథ్యంలో బీజేపీతో తెలుగుదేశం పొత్తు ఎలా కుదురుతుంది..> ఇదీ ఏపీలో సామాన్య జనంలో సైతం తలెత్తుతున్న ప్రశ్న. అయితే చంద్రబాబు మాత్రం బీజేపీతో పొత్తు కోసం నిన్న మొన్నటి వరకు తహతహలాడుతూనే ఉన్నారు. పార్టీ కేడర్ మాత్రం బీజేపీతో పొత్తు వద్దని మొత్తుకుంటున్నారు.
కేంద్రంలో మిత్రపక్షాలైన కొన్ని అంశాల్లో బిజేపిని వ్యతిరేకిస్తాయేమో గాని.. పైకి సంబంధం లేనట్లు ఉంటూ..అంతర్గతంగా బిజేపి మిత్రుడుగా ఉంటున్న జగన్ మాత్రం ప్రతి అంశంలోనూ మోదీ సర్కార్కు సపోర్ట్ గానే ఉంటారు. ఇప్పటివరకు పార్లమెంట్ లో బిజేపి తెచ్చిన ప్రతి బిల్లుకు జగన్ జై కొట్టారు. అలాగే బిజేపి సైతం..జగన్కు అండగానే ఉంటుందనే విషయం గురించి చెప్పాల్సిన పని లేదు. అడిగినప్పుడు అప్పు పుడుతుంది..నిధులు బాగానే వస్తున్నాయి.
ఇక ఢిల్లీ రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణకు ఉద్దేశించిన ఆర్డినెన్స్కు బదులుగా తీసుకొస్తున్న బిల్లుకు మద్దతివ్వాలని జగన్ నిర్ణయించారు. దీంతో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్కు జగన్ షాక్ ఇచ్చినట్లు అయింది.
దేశ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ సవరణ బిల్లు, 2023కు మద్దతు కూడగట్టడం కోసం కేజ్రీవాల్ అనేక ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బిఆర్ఎస్ సహ పలు విపక్షాలు ఆయనకు మద్ధతు ఇచ్చాయి. కానీ వైసీపీ కేంద్రం తెచ్చే బిల్లుకు మద్ధతు ఇస్తుంది. దీని బట్టి చూస్తే బిజేపి-జగన్ ఒక్కటే అని చెప్పుకోవచ్చు.
కానీ అదే బిజేపితో జనసేన పొత్తులో ఉంది. పవన్ మాత్రం జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇటు టిడిపితో బిజేపి-జనసేన కలుస్తాయని అంటున్నారు. అయితే బిజేపి మాత్రం జగన్కు సపోర్ట్ ఇస్తుంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు..బిజేపితో పొత్తు పెట్టుకుంటే నష్టమే అంటూ తెలుగు దేశం పార్టీ కీలక నేతలు సైతం వారిస్తున్నారు.