వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళా కమిషన్ కు అందిన ఫిర్యాదు మేరకు స్పందించింది. దీనికి తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కు కమిషన్ లేఖ రాసింది. అలాగే స్వంతంత్ర దర్యాప్తు జరిపించి వీలైనంత త్వరగా కమిషన్కు నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీ కి కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ లేఖ రాశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ప్రధాని మోదీ దృష్టికి కూడా వెళ్లింది. ఎంపీ జస్బీర్సింగ్ గిల్ మోదీకి లేఖ రాశారు. గోరంట్ల( వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని ఆయన లేఖలో తెలిపారు. పార్లమెంట్ ఎంపీలకు మాయని మచ్చలా ఉందని.. ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారని అని లేఖలో తెలిపారు.