కంపెనీల పేరుతొ మోసాలకు పాల్పడుతున్న బడాబాబులకు ఈడీ షాక్ మరింత తగలనుంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate)ను కేంద్రం మరింత శక్తివంతం చేసింది. మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి (15 institutions under Enforcement Directorate) తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎంఎల్ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం (Central Government)మార్పులు చేసింది. రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈడీ కోరిన ఏ సమాచారాన్నైనా ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్లో వెల్లడించింది. విదేశాంగశాఖ, ఎన్ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఈడీ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.