స్పానిష్ నుంచి భరతదేశ పర్యటనకు వచ్చిన ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణం ఝార్ఖండ్లో దుమ్కా జిల్లాలో హన్స్దిహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. స్పానిష్ కు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. శుక్రవారం రాత్రి వారు బైక్పై దుమ్కా మీదుగా భాగల్పూర్ బయలుదేరారు.
12 గంటల సమయంలో హన్స్దిహా మార్కెట్ ముందు కుంజీ-కురుమహత్గా పిలిచే ప్రదేశంలో బైక్ ఆపారు. అదే సమయంలో 8 నుంచి 10 మంది అక్కడకు చేరుకుని దంపతులపై దాడిచేశారు. ఆపై మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.