”విలువలు, విశ్వసనీయత అని జగన్ పదే పదే చెపుతూ ఉంటారు.. సొంత చిన్నాన్నను హత్య చేసిన వాళ్లను వదిలిపెట్టడం ఎంత వరకు సమంజసం.. మరోసారి వైసీపీకి ఓటేస్తే హత్యా రాజకీయాలను ప్రోత్సహించినట్లవుతుంది..” అని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేసారు. వివేకానంద్ రెడ్డిని చంపిన వారిని వదిలిపెడితే సమాజానికి ఏమి సందేశం వెళుతుందని సునీత ప్రశ్నించింది.
ఢిల్లీలో సునీత మీడియాతో మాట్లాడిన వాటిలో కీలక అంశాలు
”జగన్మోహన్ రెడ్డి మంచి-చెడుకు యుద్ధం అంటున్నారు.. నాన్న హత్య కేసులో ఏది మంచి.. ఎవరు చేసారో జగన్ చెప్పాలి..”
”అరెస్టు చేయడానికి వెళ్లి.. సీబీఐ వెనక్కి వచ్చిన ఘటన భారత దేశంలో గతంలో ఎపుడైనా జరిగిందా? కర్నూలు లో అవినాష్ ని అరెస్టు చేయడానికి వెళ్లి సీబీఐ ఎందుకు వెనక్కి వెళ్ళింది?”
”మా నాన్న వివేకానంద్ రెడ్డి హత్యపై కూతురుగా నేను చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉందని ప్రజలకు అనిపిస్తే.. వైసీపీని ఓడించాలని కోరుతున్నాను..”
”మొదట సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీబీఐ విచారణ అంశాన్ని ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు..”
”సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతొంది.. ”
”నాన్న వివేకా హత్య కు సంబంధించి ప్రజలలోకి ఎలా వెళ్ళాలి అనేది నిర్ణయించుకోలేరు…”
”పేదలకు పెత్తం దారులకు యుద్ధం అంటావ్.. నా తండ్రిని చంపిన పెత్తందార్లను ఎందుకు పట్టుకోలేకపోయారు…”