‘ఇష్టానుసారం యాడ్స్ (ప్రకటనలు) ఇస్తే ఇక కుదరదు. తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలతో పాటు, సంబంధిత పత్రిక/ఛానల్/వెబ్ సైట్ లను కూడా బాద్యుల్ని చేసే నూతన నిబంధన తీసుకువచ్చింది కేంద్రం..’
ప్రింట్, ఆన్ లైన్, టీవీలో వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై కేంద్రం కొరఢా ఝళిపించనుంది. సరోగేట్ యాడ్స్.. ప్రచారం చేయడానికి వీల్లేని ఉత్పత్తులను అదే రీతిలో ఉండే వేరే ఉత్పత్తులను చూపించిడంపై నిషేధించింది. ఈ నిబంధనలు సెలబ్రిటీలకు వర్తిస్తాయని పేర్కొంది. రాయితీలు, ఉచితాలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని చిత్రీకరించే ప్రకటనలపై కూడా నిషేధం విధించింది. ఈమేరకు కఠిన నిబంధనలతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే వినియోగదారుల రక్షణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఉత్పత్తి తయారీదారులు, ప్రచారకర్తలు, ప్రకటనకర్తలు నిబంధలను తొలిసారి ఉల్లంఘిస్తే.. రూ.10 లక్షలు, తర్వాత ప్రతిసారీ రూ.50 లక్షలు జరిమానా విధిస్తామనిస్పష్టం చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఏడాది నిషేధం విధిస్తామని.. మళ్లీ ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకూ పొడిగిస్తామని తెలిపింది. ప్రభుత్వరంగ సంస్థలు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనలకు కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.