Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home జాతీయం

రేషన్ కోసం బెంజ్ కారులో వచ్చాడు

V Srinivas by V Srinivas
September 7, 2022
in జాతీయం
రేషన్ కోసం బెంజ్ కారులో వచ్చాడు

మన దేశంలో రేషన్ పంపిణి కి ఈ ఘటన అద్దం పడుతుంది. .

పేద ప్రజల కోసం ప్రభుత్వాలు అందించే రేషన్‌ పంపిణీలో జరిగే అవకతవకలు మరోసారి బయటికొచ్చాయి. ఓ వ్యక్తి రేషన్‌ దుకాణంలో సరకులు తీసుకునేందుకు ఏకంగా బెంజి కారులో వచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో జరిగిందీ ఘటన.
వివరాల్లోకి వెళితే.. హోషియార్‌పుర్‌లోని ఓ ప్రభుత్వ రేషన్‌ దుకాణం ముందు ఓ లగ్జరీ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగి నేరుగా రేషన్ దుకాణంలోకి వెళ్లాడు. తన బీపీఎల్‌ (బిలో పావర్టీ లైన్) కార్డు చూపించి సరకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ సంచులను కారు డిక్కీలో పెట్టించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి రేషన్‌ దుకాణం నుంచి కారులో సరకులు తీసుకెళ్తోన్న వీడియోను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది.

సదరు రేషన్‌ దుకాణాన్ని అమిత్‌ కుమార్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈ వీడియో వైరల్‌ అవడంతో స్థానిక మీడియా విలేకరులు అమిత్‌ను ప్రశ్నించారు. అయితే ఆ వ్యక్తికి బీపీఎల్‌ కార్డు ఉందని.. తాను కేవలం ఆ కార్డును పరిశీలించిన తర్వాతే రేషన్ ఇచ్చానని తెలిపారు. అతడు కారులో వచ్చిన విషయం తనకు తెలియదన్నారు.
అయితే ఈ వీడియో కాస్తా తీవ్ర వివాదానికి దారితీయడంతో ఆ బెంజి కారులో వచ్చిన వ్యక్తి స్పందించాడు. ఆ కారు తమ బంధువులదని, వారు విదేశాలకు వెళ్లడంతో కారును తమ ఇంటి ముందు పార్క్‌ చేసి వెళ్లారని చెప్పాడు. అందుకే అప్పుడప్పుడు ఆ కారును తాను ఉపయోగిస్తున్నానని తెలిపాడు. తాను పేద వ్యక్తినే అని, డబ్బుల్లేక తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ఇది వాస్తవమా? కాదా అనే దానిపై పంజాబ్ అధికారులు విచారణ మొదలుపెట్టారు.

ShareSendShareTweet
Previous Post

అమరావతి కోసం రెండో విడత రైతుల పాదయాత్ర

Next Post

 వివాదాలున్నా సాగిపోతున్న ‘రుషికొండ’ పనులు

Related Posts

క్షమాపణ చెప్పను.. సుప్రీంకోర్టులో రాహుల్ అఫిడవిట్
జాతీయం

రాహుల్‌కు బిగ్ రిలీఫ్.. శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు

August 4, 2023
క్షమాపణ చెప్పను.. సుప్రీంకోర్టులో రాహుల్ అఫిడవిట్
జాతీయం

క్షమాపణ చెప్పను.. సుప్రీంకోర్టులో రాహుల్ అఫిడవిట్

August 2, 2023
పవార్‌తో ”చేతులు” కలిపిన మోదీ
జాతీయం

పవార్‌తో ”చేతులు” కలిపిన మోదీ

August 1, 2023
Next Post
 వివాదాలున్నా సాగిపోతున్న ‘రుషికొండ’ పనులు

 వివాదాలున్నా సాగిపోతున్న ‘రుషికొండ’ పనులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

No Content Available
Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved