> ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. వారు చదువు కోసం వెళ్లే దేశాల సంఖ్య కూడా ఏటా పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో మన విద్యార్థులుపలు కోర్సులను అభ్యసిస్తున్నారు. అంటే భూమండలం మీద ఉన్న సగం దేశాలకు ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు వెళ్తున్నారన్న మాట. మన వాళ్ళు ఉన్నత చదువుల కోసం వెళ్లే .. అన్ని దేశాల్లో కలిపి 11.35 లక్షల మంది విద్యార్థులున్నారట. వారిలో 80-85 శాతం మంది పీజీ విద్యకే వెళ్లినట్టు విదేశాంగ శాఖలోని ‘బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 99 దేశాల్లో భారతీయ విద్యార్థులు వివిధ రకాల కోర్సులను అభ్యసిస్తున్నట్లు విదేశాంగ శాఖలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా యూఏఈ, కెనడా, అమెరికా, జర్మనీ దేశాలకు వెళ్తున్నట్లు సమాచారం. < వైద్య విద్య కోసం .. చైనా, జర్మనీ, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, కిర్గిస్థాన్, కజికిస్థాన్ దేశాలకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఉక్రెయిన్కు భారత్ నుంచి వెళ్లిన 18 వేల మంది విద్యార్థులలో మెజార్టీ స్టూడెంట్స్ వైద్య విద్య అభ్యసిస్తున్నట్టు ఆ గణాంకాలు సూచిస్తున్నాయి. అత్యధికంగా కెనడాలో 2.15 లక్షల మంది, అమెరికాలో 2.12 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. విదేశీ విద్యకు వెళ్లే వారిలో చదువు పూర్తయిన తర్వాత భారత్కు వచ్చేవారి శాతం అతి స్వల్పమేనని, ఎక్కువ మంది ఆయా దేశాల్లోనే ఉద్యోగాలు, బిజినెస్ లలో స్థిరపడుతున్నారని కూడా పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయ్.