అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట లో సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత రూపొందించిన శాండ్ ఆర్ట్ విశేషంగా ఆకట్టుకుంటుంది. “అవనిలో సగం మేమే . ఐనా మాపై వివక్ష ” అనే నినాదంతో రూపొందించిన సైకత శిల్పం ఆలోచింపచేసే సందేశాన్ని ఇస్తుంది. ప్రముఖ దినోత్సవాల సందర్బంగా దేవిన సిస్టర్స్ .. తండ్రి శ్రీనివాస్ సహకారంతో రెగ్యులర్ గా సైకత శిల్పాలు రూపొందిస్తున్నారు.