క్రీస్తు శకం 9, 10వ శతాబ్దం కాలానికి చెందిన అరుదైన మన పురాతన కళా సంపదను ప్రధాని మోడీ స్వయంగా పరిశీలించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్లు సోమవారం వర్చువల్గా సమావేశం కానున్న నేపథ్యంలో భారత్కు చెందిన 29 పురాతన వస్తువులను ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చేసింది. శివుడు, విష్ణుమూర్తి అవతారాలు, జైన విగ్రహాలతోపాటు ఇతర అత్యంత ఖరీదైన అలంకార వస్తువులు వీటిలో ఉన్నాయి. అప్పట్లో రాజులు, చక్రవర్తుల వినియోగించిన వస్తువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ విగ్రహాలన్నీ క్రీస్తు శకం 9, 10వ శతాబ్దం కాలానికి చెందినవని అధికారులు తెలిపారు. ఈ పురాతన విగ్రహాలు గుజరాత్,తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవని అని ఆర్కియాలజిస్టులు చెపుతున్నారు.
ఆస్ట్రేలియా, భారత్ మధ్య నెలకొన్న మైత్రీ బంధం కారణంగా భారత్ విజ్ఞప్తి మేరకు ఆస్ట్రేలియా వీటిని మనకు తిరిగి ఇచ్చేసింది.