హిందూ దేవతలు, దేవుళ్లపై ఢిల్లీ జేఎన్యూ వీసీ శాంతిశ్రీ ధూళిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్మశాన వాటికల్లో తిరుగుతూ, పరిమితమైన బట్టలతో.. మెడలో పాములు వేసుకొనే శివుడు బ్రాహ్మణుడు కాదని ఆమె అన్నారు. బహూశా శివుడు.. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడై ఉంటాడని కూడా శాంతి శ్రీ భాష్యం చెప్పారు. ఆ మాటకొస్తే.. దేవతలెవరూ బ్రాహ్మణులు కాదన్నారు. దేవుళ్లలో క్షత్రియులే అధికులని కూడా వెల్లడించారు. మనుస్మృతి ప్రకారం.. మహిళలందరూ దళితులేనని, అలాంటప్పుడు.. దేవతలు బ్రాహ్మణుల కుటుంబంలో ఎలా పుట్టగలరని ప్రశ్నించారు. మనుస్మృతి ప్రగతి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. వీసీ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.