శ్రీరాముడి జీవితంతో ముడిపడిన పుణ్యక్షేత్రాలను కలుపుతూ ‘శ్రీ రామాయణ యాత్ర’ పేరిట ఐఆర్సీటీసీ ఓ టూరిస్ట్ ప్యాకేజీ ప్రకటించింది. జూన్ 21 నుంచి 18 రోజుల పాటు సాగే ఈ రైలు యాత్రలో అయోధ్య, జనక్పూర్, సీతామర్హీ, బక్సర్, వారణాసి, ప్రయాగ్రాజ్, శ్రింగవేర్పూర్, చిత్రకూట్, నాసిక్, హంపీ, రామేశ్వరం, కాంచీపురం, భద్రాచలం క్షేత్రాలను చూపిస్తారు. టిక్కెట్ ధర ఒక్కరికి రూ. 62,370. మరిన్ని వివరాలకు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ వీక్షించగలరు.