“తమ బిడ్డను అన్యాయంగా చంపిన వైసీపీ MLC అనంత ఉదయ్ భాస్కర్ పై ఏపీ పోలీసుల విచారణపై తమకు నమ్మకంలేదని …హత్యకు గురైన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేసారు..” టీడీపీ అధినేత చంద్రబాబును వాళ్ళు శుక్రవారం అమరావతిలో కలిశారు.
తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయగా… అతను ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ‘ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరినా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై తమకు నమ్మకం లేదని అన్నారు. అనంత బాబును ఈ కేసు నుండి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.’ చంద్రబాబు సుబ్రమణ్యం పేరెంట్స్ కి ధైర్యం చెప్పి… ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీబీఐ విచారణకు ఒత్తిడి తీసుకువస్తామన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి టీడీపీ నేతలు గతంలోనే రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందచేశారు. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు దిగజారిపోతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.