‘‘తెలంగాణ నా గుండెచప్ఫుడు. ఈ ఎన్నికలతో ఇకపై తెలంగాణలో అడుగుపెడుతున్నాను. తెలంగాణ ధైర్యంతోనే ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నాను’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. . బుధవారం హనుమకొండ హాంటర్ రోడ్డులోని బీజేపీ విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని.. గుండాల పాలన నడుస్తోందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని తెలిపారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని అన్నారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నానని… వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతాను అని జనసేనాని స్పష్టం చేశారు.