ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ స్ఫూర్తి ఎ క్కువ. అయితే తెలుగు దేశం పార్టీలో మాత్రం.. ఏకంగా టికెట్స్ ప్రకటించేసుకునేంత స్వతంత్రం తీసేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. దీనిపై పార్టీ అధిష్టానం మాత్రం మౌనం వహిస్తూ.. ఉండటంపై పార్టీ కేడర్ లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
కాకినాడ లోక్ సభ నుంచి పార్టీ టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్న జగ్గంపేట టీడీపీ ఇంచార్జ్ జ్యోతుల నెహ్రు … ఓ అడుగు ముందుకేసి.. నవీన్ ఎంపీగా పోటీచేస్తాడంటూ ప్రకటన చేయడం పార్టీలో మింగుడుపడటంలేదు. పాదయాత్ర చేసినపుడు పార్టీ అభ్యన్తరం పెట్టలేదని.. అంటే టికెట్ తనకే ఇస్తారని నవీన్ సైతం ధీమాగా ప్రచారం చేసేసుకుంటున్నారు. నెహ్రూకి జగ్గంపేట అసెంబ్లీ ఇచ్చి.. కుమారుడికి కాకినాడ లోక్ సభ ఎలా ఇచ్చేస్తారంటూ టీడీపీలోనే మెజార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. జగ్గంపేట అసెంబ్లీ లోనే నెహ్రు ఇంకా బలపడాల్సి ఉండగా.. అది వదిలిపెట్టి కాకినాడ లోక్ సభ అనడంపై పార్టీ అధిష్టానం సీరియస్ గానే ఉంది.
రాజమండ్రి సిటీ అసెంబ్లీ నుంచి తన కుమారుడు ఆదిరెడ్డి వాసు ఈసారి పోటీచేస్తారంటూ ఆదిరెడ్డి అప్పారావు ప్రకటన చేసేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసు. అతనిపై కేడర్ లో వ్యతిరేఖత ఉంది. భవాని అయితేనే మళ్ళీ ఈజీగా గెలుస్తారన్న సర్వేలు కూడా ఉన్నాయి.
పై రెండు సంఘటనలు పార్టీ అధిష్టానం పట్టించుకోకుండా వదిలేస్తే.. మరింతమంది తమ టికెట్లను తామే ప్రకటించేసుకునే పరిస్థితులు తటస్థిస్తాయ్..