బీజేపీలో చేరికల పర్వం జోరు అందుకుంది… ఎటువంటి హామీ తీసుకోకుండా పార్టీలో చేరేవారి సంఖ్య పెరిగింది. రాష్ట్ర కార్యాలయంలో సినీ రంగం, విద్యారంగం, న్యాయవాదులు,రైతు నాయకులు ఇవాళ పార్టీలో చేరారు. వ్యాపార వేత్త, సినీ నిర్మాత, వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు, సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాసంస్థల అధినేత, తెలుగు దేశం సీనియర్ నేత అశోక్ రాజుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా మోదీ దేశాన్ని నడిపిస్తున్నారు. అనేక మంది బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారు మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ చేరికలతో పార్టీ మరింత బలపడి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మీడియా ఇన్ చార్జి పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ సంస్థ అధినేత కె.సుధీర్, సీహెచ్ నర్సింహమూర్తి, ఆర్ట్ ప్రొడ్యూసర్ బండి శ్రీ నివాస్ రావు, టి.శ్రీనివాస్ రావు తదితరులు పార్టీలో చేరారు.