” 2024లో విశాఖపట్నంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను..” అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్బాట ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటి? ఇపుడు రాజకీయ విశ్లేషకులతో పాటు, సామాన్య జనంలోనూ దీనిపై చర్చ నడుస్తోంది.
2014-2019 మధ్య జగన్మోహాన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా సపోర్ట్ చేసారు. తర్వాత అధికారంలోకి వచ్చాకా సీఎం పీఠం ఎక్కిన తర్వాత మూడు రాజధానుల కాన్సప్ట్ ని తెరపైకి తెచ్చారు. రాజధాని కోసం అప్పటి ప్రభుత్వంపై నమ్మకంతో 35 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతాంగాన్ని రోడ్డు పాలు చేసారు. కులం పేరుతో కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ దుష్ప్రచారం చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసారు.
మరో 50 రోజులలో ఎన్నికలు వస్తున్నాయ్. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖ రాజధానిగా ప్రమాణ స్వీకారం చేస్తానని వైజాగ్ లో ప్రకటించారు. ఈ ప్రకటనలో జగన్ ఆంతర్యం ఏమిటో కానీ,, విశాఖ రాజధాని అయితే మాకు బాగా దూరమవుతుందని రాయలసీమ వాసులలో తీవ్ర వ్యతిరేఖత మొదలైంది. అయితే జగన్ మాత్రం.. రాయలసీమ .. తమ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. వారంతా తమ వైపే ఉంటారన్న భరోసాతోనే విశాఖను రాజధానిగా ప్రకటిచ్చినట్లు చెపుతున్నారు. దీంతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీ సీట్లు ఈ ప్రకటనతో పెరుగుతాయన్న భ్రమలో జగన్ అండ్ కో ఉన్నారు. ఇది భూమ్ రాంగ్ అయ్యే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో అమరావతిని సపోర్ట్ చేసి తర్వాత మాట మార్చిన జగన్ ని ఉత్తరాంధ్ర వాసులైతే మాత్రం ఎలా నమ్ముతారు> వైజగ్ లో ఇప్పటికే భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. నకిలీ రికార్డులతో భూములను కాజేసే బ్యాచ్లు విశాఖలో నాలుగేళ్లుగా తిష్ట వేసాయి. ఈ పరిణామాలపై ప్రజలు గమనించకుండా ఉంటారా?.