రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో సీఎం జగన్ ముసుగును తొలగించి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగిస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. ఆ పోకడలను భరించలేక ఇటీవల నెల్లూరు జిల్లా సీనియర్ నేతలు టీడీపీలోకి వస్తున్నారు.. ఈ పరిణామాలను జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారని ఫైర్ అయ్యారు.
సీఎం చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారు.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రానికి ఈసీ పరిశీలకుడిని పంపాలని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. జగన్ తొత్తులుగా మారిన కొందరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.