జనసేన అధినేత పవన్కల్యాణ్ తన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో జాబితా రిలీజ్ కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు పవన్ రెండో లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తుతో 24 సీట్లలో పోటీచేస్తున్న జనసేన తొలి జాబితాలో తన ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ , కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ ఉన్నారు.
10మందితో రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, రాజోలు, నర్సాపురం, నిడదవోలు, విశాఖ సౌత్, చీరాల, తిరుపతి, గుంటూరు వెస్ట్, దర్శిస్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు తిరుపతి నుంచి కూడా పోటీకి జనసేన పట్టు బడుతోంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం ప్రయత్నంచేస్తున్నట్లు సమాచారం. అయితే తాను పోటీ చేసే స్థానంపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నారా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.