ఓ కొడుకు ఆస్తిలో తన భాగం రాసివ్వాలంటూ తన కన్నవారిపైనే పాశవికంగా ప్రవర్తించాడు. తండ్రిని గుండెలపై తన్ని, తల్లిని జుట్టుపట్టుకొని వీధిలో ఈడ్చి ఈడ్చి కొట్టాడు. దానిని ఎవరో ఫోన్ లో రికార్డు చేస్తే అది వైరల్ గా మారింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారించి తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఈ ఘటన ఏపీలోని అన్నమయ్యజిల్లా మదనపల్లె లో జరిగింది. గుంతవారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ మదనపల్లెలోని అయోధ్యనగర్ లో ఓ కల్యాణ మండపంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. అయితే చిన్న కొడుకు శ్రీనివాసులు రెడ్డి చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వారికి మూడెకరాల నట్టా, రెండెకరాల డీకేటీ భూమి ఉంది. తన వాటా కోసం కొంతకాలంగా తల్లిదండ్రులు, సోదరుడితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో2న తల్లిదండ్రులతో ఘర్షణకు దిగాడు. విచక్షణారహితంగా దాడిచేశాడు.