”టీడీపీ, బీజేపీ పొత్తు పొడిచేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో జన ప్రభంజనం టీడీపీ వైపే ఉన్నా.. వైసీపీ అరాచకాలతో పోలింగ్ శాతం తగ్గుతుందన్న ఆందోళనలో ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీ పెట్టే షరతులకు సై అంటున్నారు . 12 పార్లమెంట్ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు బీజేపీ అడుగుతున్నా.. ఇందులో 8, 12 సీట్లకు ఒప్పందం కుదిరే ఛాన్స్ కనిపిస్తోంది…”
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తాజాగా బాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీతో సార్వత్రిక ఎన్నికలలో పొత్తు విషయమై ఢిల్లీలో కీలక చర్చలు జరపనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్తో చంద్రబాబు భేటీ అయిన సందర్బంగా పొత్తు అంశంపై చర్చించుకున్నారు. బుధవారం ఉదయమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. వీరు కూడా బీజేపీ తరపున చర్చలలో పాల్గొనే అవకాశం ఉంది.