నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Project) వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం (AP Government) పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ రాష్ట్ర పోలీసులు (AP Police) మోహరించారు. ఇటు తెలంగాణ పోలీసులు (Telangana Police) డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. శుక్రవారం ఐజీ స్థాయి అధికారులు సాగర్ వద్దకు చేరుకొని పరిస్థితి అంచనా వేసారు. ఇప్పటికే సుమారు 4 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి దౌర్జన్యంగా విడుదల అయ్యాయి. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 522 అడుగుల చేరువలో ఉంది. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం ఉంది. నిన్నటి నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.
తెలంగాణ పోలింగ్ రోజునే నాగార్జున సాగర్ నీటి వివాదం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లోపాయికారి చీకటి ఒప్పందాలు మేరకే అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఇరువురు నేతలు సమాధానం చెప్పాలి.