టీడీపీ యువనేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కాకినాడలో లోకేష్ను దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు కలిసారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చాక విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. దివ్యాంగులపై మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వయం ఉపాధికి సంబంధించిన సబ్సిడీ లోన్లు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు విదేశీవిద్య, చంద్రన్న పెళ్లికానుక అమలు చేస్తామన్నారు. దివ్యాంగులపై దాడులకు పాల్పడేవారిపై టీడీపీ అధికారంలోకి వచ్చాకా…కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు.
Tags: Lokesh YuvaGalam: