”రాజధాని ఫైల్స్..” సినిమా విడుదల నిలిపివేయడానికి కారణాలు లేవు.. అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 15 వ తేదీన విడుదలైన ”రాజధాని ఫైల్స్” సినిమాలో ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నాయంటూ వైసీపీ ఎమ్మెల్స్సి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు రాజధాని పైల్స్ ను ఆపివేసిన సంగతి తెలిసిందే. అయితే… 16వ తేదీన విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం తాజాగా రాజధాని ఫైల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉభయ రాష్ట్రాలలో సినిమా ప్రదర్శనకు ఆటంకాలు తొలగిపోయాయి.