తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ పై పోటీ చేస్తానని చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో రాజకేయ సంచలనం అయింది.
” కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే ఈగోలు పక్కన పెట్టి లక్ష్యం కోసం పనిచేయాలి. అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించిన రీతిలో.. బీజేపీ కార్యకర్తలకు కేసీఆర్ మాత్రమే కనిపించాలి” – బీజేపీ శ్రేణులకు ఈటల పిలుపు.
‘రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై గజ్వేల్ నుండి పోటీ చేస్తా. నా రాజకేయ ప్రస్థానం గజ్వేల్ నుంచే ప్రారంభమైంది.. ఇక్కడి నుంచి పోటీకి సంబంధించి ఇప్పటికే త క్షేత్ర స్థాయిలో కార్యాచరణ చేపట్టాను. ఈ మేరకు బీజేపీ అధిష్టానం కూడా నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న నమ్మకం ఉంది…’ అని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మంత్రివర్గం నుండి రాజీనామా చేసి, బీజేపీలో చేరి ఆమెపైనే పోటీ చేసి, ఆమెను ఓడించిన సువేందు అధికారి తరహాలో కేసీఆర్ ను ఓడించి తీరుతానని భరోసా వ్యక్తం చేశారు.
త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, ఇందుకు పక్కా ప్రణాళికలు జరుగుతున్నాయి. . అధికార టీఆర్ఎస్ పార్టీ త్వరలో ఖాళీ అవుతుంది…. సీఎం కేసీఆర్ గ్రాఫ్ జారుడు బండ మాదిరి పడిపోతుంది.. అని ఈటల స్పష్టం చేశారు. ఈటల ప్రకటనతో బీజేపీ కేడర్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాజేందర్ ప్రకటనను.. అధికార టీఆర్ఎస్ సైతం సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తుంది.