”కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొండి పట్టుదలతో ఉన్నారు.” మోదీ ఇంటిపేరు (Modi Surname) వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుప్రీంకోర్టు (Supreme court)లో బుధవారంనాడు అఫిడవిట్ దాఖలు చేశారు. 63 పేజీల అఫిడివెట్లో రాహుల్.. ఈ కేసు ‘అసాధారణమైన కేటగిరి’ కిందకు రాదని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. తాను శిక్షార్హమైన ఎలాంటి నేరానికి పాల్పడలేదని, క్షమాపణే చెప్పాల్సి వస్తే అదే అతిపెద్ద శిక్ష అవుతుందని పేర్కొన్నారు. ఒక వేళ క్షమాపణే అయితే ఈ పాటికే చెప్పేవాడనని అన్నారు. క్షమాపణ చెప్పేదిలేదని తేల్చి చెప్పారు.
తాను ఏ నేరం చేయలేదని, అయినా ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద క్రిమినల్ నేరం మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. తనకు విధించిన శిక్షపై స్టే ఇవ్వాలని అఫిడవిట్లో కోరారు. తద్వారా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.
అసలు కేసు ఏమిటి?