- దేశంలో విభజన రాజకీయాలు పైపైకి..
- ప్రజల ఐక్యత మధ్య కొందరి చిచ్చు
” దేశంలో భారతీయులను విభజించేందుకు రాజకీయ అవకాశవాదులు చేస్తున్న కుట్రలు ప్రస్తుతం పెరిగిపోతున్నాయి..” అని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల ఐక్యతను కాలరాసేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి సమయంలోనే ప్రశ్నించే శక్తిమంతమైన గొంతుక అవసరమని నొక్కిచెప్పారు. బెంగాలీ వార్తాపత్రిక ‘ఆనందబజార్’ వందో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘రాజకీయ అవకాశవాద శక్తులు భారతీయుల్లో విభజన తెస్తున్నాయి. దేశంలో కలిసిమెలసి జీవిస్తున్న హిందూ, ముస్లింల మధ్య మతం పేరిట చీలికకు ప్రయత్నిస్తున్నాయి. మన ఐకమత్యాన్ని ధ్వంసం చేస్తున్నాయి. దీన్ని ప్రశ్నించడానికి ఈ సమయంలో ఓ శక్తిమంతమైన గొంతుక కావాలి’ అని అమర్త్యసేన్ అన్నారు.