గడిచిన కొన్ని నెలల్లో ప్రపం చ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు కాస్త మెరుగైనప్పటికీ, అనిశ్చితులు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రుణ ఒత్తిళ్లు, ఆర్థిక స్థిరత్వానికి పొంచి ఉన్న ముప్పులతోపాటు ప్రపంచ ఆర్థి క వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను జీ-20 దేశాలు దృఽఢసంకల్పంతో పరిష్కరించాలని ఆయన కోరారు. జీ20 సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశాల ప్రారంభ సెషన్లో దాస్ ప్రసంగించారు. ‘‘ ప్రపంచం తీవ్ర మాంద్యానికి బదులు వృద్ధి మందగమనాన్ని మాత్రం ఎదుర్కోవాల్సి రావచ్చన్న ఆశాభావం నెలకొంది. అయినప్పటికీ, అనిశ్చితులు తొలిగిపోలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.