‘రాఖీ రోజున తన సోదరి విగ్రహం ఊరేగించి.. ఆమెలా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ కి గురికావద్దని ఆడబిడ్డలకు తన సందేశం ఇచ్చాడు..’
రాఖీ పండుగ వేల మరణించిన అక్క విగ్రహ ఊరేగింపు అందరినీ కంట నీరు పెట్టించింది. కాకినాడలోని పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన బాబు రాజా సోదరి బైక్ ప్రమాదంలో మృతి చెందింది. తన అక్క మరణం జీర్ణించుకోలేని తమ్ముడు ఆమె విగ్రహం తయారు చేయించాడు. రాఖీ పండుగ సందర్భంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. తన అక్కకు జరిగినట్లు మరెవరికి జరగకూడదని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. బైక్ నడిపే ఆడపడుచులంతా జాగ్రత్తగా నడపాలని సూచించాడు. ఇంటి నుంచి బయలుదేరే ఆడపిల్లలు జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పదే పదే కోరాడు.