వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతీ లేదని పిటిషన్లో పేర్కొన్నారు. నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారని సునీతారెడ్డి కోర్టుకి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరగాలని ఈ సందర్బంగా ఆమె కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీబీఐనీ ప్రతివాదులుగా చేర్చారు. సుమారు 500 పేజీల పిటిషన్ ను సుప్రీంకు సమర్పించారు.