కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓటమి చాలా క్లియర్ గా ఉందని జోస్యం చెప్పారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. 2004లో చంద్రబాబుకు 70 శాతం ఓట్ షేర్ వచ్చిందని… 2014లో అది 62.5 శాతానికి పడిపోయిందని… 2019లో మరింత దిగజారి 55.19 శాతానికి పరిమితమయిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కేవలం 30,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని చెప్పారు. 2024 ఎన్నికల్లో సొంత సీటును కూడా చంద్రబాబు కాపాడుకోలేరు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారనే విషయాన్ని మర్చిపోవాలని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.