జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగాలపై ఈ కేసు నమోదైంది. గతేడాది జులై 9న పవన్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది.
తాడికొండ మండలం కంతేరుకి చెందిన వాలంటీర్ పవన్ కుమార్తో పాటు మరి కొందరు ఇచ్చిన వాంగ్మూలంపై కేసు నమోదు చేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రమంలో 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్పై జిల్లా కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయగా.. నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. మార్చి 25న గుంటూరు కోర్టులో పవన్ హాజరు కావాలని నాలుగో అదనపు జడ్జి శరత్బాబు తాజాగా ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేశారు.