”కొత్తగా ఏర్పడిన రాజధాని కోసం తమ భూములు ఇస్తే.. రాష్ట్రానికి, తమకూ మంచి భవిష్యత్తు ఉంటుందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విశ్వాసంతో 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతు సోదరులు .. వైసీపీ మూడు రాజధానుల ముచ్చటలో నలిగిపోయారు. ఇప్పటికి 1500 రోజులుగా తమకు న్యాయం కావాలంటూ ఉద్యమం చేస్తూనే ఉన్నారు. భారదేశ చరిత్రలోనే సుదీర్ఘ కాలం జరుగుతున్న పోరాటంగా అమరావతి ఉద్యమం నిలిచిపోనుంది..”
పోలీసుల నిర్బంధాలు, లాఠీల దెబ్బలను ఓర్చుకుంటూనే పోరాటం సాగిస్తున్నారు. పాలకుల పన్నాగాలు., వారి పోరాట పటిమను దెబ్బతీయలేకపోయాయి. అందుకే ఆ మహా మహోద్యమం మరిచిపోలేని విజయాలతో ముందుకు సాగిపోతోంది. దేశ చరిత్రలో సుదీర్ఘ సమరశీల పోరాటంగా నిలిచిపోయింది. అయితే, వీరి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు భగ్నం చేసేందుకు సర్కారు చేయని ప్రయత్నం లేదు. 40 మందిపై కేసులు పెట్టి 20 రోజులపాటు జైలుపాలు చేసింది ఇప్పటి వరకూ 2600 మందిపై 600కు పైగా కేసులు బనాయించారు. నాలుగేళ్లలో 250 మంది రైతులు అమరావతి అక్ర0దనలతో గుండె పగిలి అమరులయ్యారు.
పోరాట0 ఇలా..
రాజధాని అమరావతి నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. కానీ 2019, డిసెంబరు 17న సీఎం జగన్ శాసన సభలో చేసిన మూడు రాజధానుల ప్రకటన రాజధాని వాసులను కుదిపేసింది. ఆ మర్నాడే రాజధాని ఉద్యమం ఊపిరిపోసుకుంది.
మహోజ్వల ఘట్టం
అమరావతి ఉద్యమంలో రాష్ట్రం మొత్తాన్నీ ఏకం చేయాలన్న భావనతో 2021, నవంబరు 1న రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పాదయాత్ర ఉద్యమ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు రాజధానిపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలన్నింటినీ ఈ పాదయాత్ర తిప్పికొట్టింది. నవంబరు 1న హైకోర్టు వద్ద మొదలై డిసెంబరు 17న తిరుమల శ్రీవారి చెంతకు చేరే వరకు 57 రోజుల పాటు ఈ యాత్ర సాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభకు రాయలసీమ వాసుల నుంచి అనూహ్య స్పందన లభించడం విశేషం. అమరావతి ఉద్యమం వెయ్యిరోజుల మైలురాయిని చేరిన సందర్భంగా రాజధాని రైతులు ‘అమరావతి నుంచి అరసవల్లి’ వరకు మహా పాదయాత్ర చేసి జనంలో సపోర్ట్ పొందారు.
ఉద్యమం లో కొన్ని కీలక ఘట్టాలు
- 2019 డిసెంబరు 17న శాసనసభలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారు. మర్నాడే రాజధాని ఉద్యమం మొదలైంది.
- డిసెంబరు 31న తమకు కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని కోరుతూ రైతులు రాష్ట్రపతికి లేఖలు రాశారు.
- 2020 జనవరి 3న ఉద్యమం చేస్తున్న అమరావతి మహిళలపై పోలీసులు దాడి చేశారు. దీనికి నిరసనగా రాజధాని గ్రామాలు బంద్ నిర్వహించాయి.
- జూలై 4 నాటికి ఉద్యమం 200 రోజులకు చేరుకుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో దీక్షలు చేపట్టారు. 200 నగరాల నుంచి ఎన్ఆర్ఐలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఉద్యమానికి మద్దతు తెలిపారు.
- అక్టోబరు 12 నాటికి ఉద్యమం 300 రోజులకు చేరుకుంది. ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా తుళ్లూరులో ‘ఆత్మబలిదాన యాత్ర’ భారీగా నిర్వహించారు.
- 2021 జనవరి 20 నాటికి ఉద్యమం 400 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు చేపట్టిన ‘రాజధాని సంకల్ప ర్యాలీ’ విజయవంతమైంది. అదే రోజు ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ కేసును హైకోర్టు కొట్టేసింది.
- 2022, ఫిబ్రవరి 24నాటికి అమరావతి ఉద్యమం 800 రోజులకు చేరింది. యువకులు పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. వీటితో పాటు రైతు గర్జన, జనభేరి కార్యక్రమాలను కూడా నిర్వహించారు.