“ఆదిదేవుని ఆశీస్సుల కోసం పరితపించని హిందువు ఉండడు. శివునికి ప్రీతికరమైన శివరాత్రి రోజున ఆ భోళాశంకరుని కృప కోసం లక్షలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచీ శివాలయాలకు వెళ్లి అది దంపతులను కరుణా-కటాక్షాల కోసం శరణు వేడుకున్నారు.”
మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా “బలివే” శివాలయానికి పెద్ద ఎత్తున కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి చౌదరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రసాద వితరణ చేశారు.
కృష్ణ జిల్లా వైపు ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా వైపు మరొక ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తులకు పులిహార, స్వీట్ తోపాటు 50 వేల బట్టర్ మిల్క్ ప్యాకెట్లను అందించారు. ప్రతి ఏటా శివరాత్రి కి తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బలివే ఆలయంలో భక్తుల కోసం ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది స్థానికుల విజ్ఞప్తి మేరకు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశామని ‘తపన ఫౌండేషన్’ నిర్వాహకులు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళే దారిలో విజయరాయి సమీపంలో బలివే ఆలయం వుంది. ఏటా వేలాదిమంది ఈ ఆలయానికి తరలివస్తుంటారు. బలివే శివుణ్ణి దర్శించుకుంటే శుభాలు జరుగుతాయని ఈ ప్రాంతంలో భక్తుల ప్రగాఢ విశ్వాశం.