మహా శివ రాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట లో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ రూపొందించిన ‘ఆది దంపతుల’ రూపాలను ఇసుక తో రూపొందించారు. కాకినాడ బీచ్ నుంచి రెండు లారీల ఇసుక రప్పించి గ్రామస్తులు, శివాలయ కమిటీ సహకారంతో ఈ సైకత శిల్పాన్ని తీర్చి దిద్దారు. శివాలయాన్ని సందర్శించదానికి విచ్చేసిన భక్తులతో పాటు, ఈ సైకత శిల్పాన్ని ప్రత్యేకంగా వీక్షించడానికి కూడా భక్తులు విచ్చేస్తున్నారు.
“శివ తత్వం తెలుసుకో.. నిన్ను నీవు దిద్దుకో ” అనే నినాదంతో ఈ సైకత శిల్పం రూపొందించారు. శ్రీనివాస్ సైకత శిల్ప కళను సొంతంగా నేర్చుకుని, నాలుగేళ్లుగా అనేక జాతీయ, అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలలో పాల్గొన్నారు.