- త్రిపుల్ రైడింగ్ తో అల్లరి మూక హల్ ఛల్
- ఆర్టీసీ డ్రైవరుపై దౌర్జన్యం
విశాఖలో బైక్ రేసింగ్ తీవ్రస్థాయిలో పెరిగిపోతోంది. బైక్ రేసింగ్ బెట్టింగులు నగరంలో చాపకింద నీరులా సాగిపోతున్నాయి. ఖాళీ రోడ్లపైనే కాదు. హైవేలపై కూడా జోరుగా సాగుతున్నాయి. వారి భీభత్సం నిత్యం నగరంలో ఏదో చోట.. ఏద ఒక ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. మహానగరంలో శాంతిభద్రతలు కొరవడడంతో ఆకతాయిల అల్లర్లు మితిమీరిపోతున్నాయా? అసాంఘిక కార్యక్రమాలు కళ్ల ముందే జరుగుతున్నా పోలీసు శాఖ చోద్యం చూస్తోందా? అంటే నిజమే అనే ఘటనలు చాలానే దర్శనమిస్తున్నాయి మరి.
బైక్ రేసులు, రైడింగ్ లు ఇతర నేరాలకు యువకులు పాల్పడుతున్నారు. దానికి నిదర్శనం ఆదివారం రాత్రి నగరంలో బైక్ రైడర్స్ సృష్టించిన భీభత్సమే.. అధిక సంఖ్యలో బైక్ రైడర్స్ రెచ్చిపోయారు. రాత్రి 11 దాటిన తర్వాత నుంచి తెల్లవారు మూడు గంటల వరకు బైక్ రైడర్లు భయానక వాతావరణం కలిగించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, బీచ్ రోడ్ ,చిన వాల్తేర్ ప్రాంతాల్లో బైకులు రై రై మంటూ దూసుకుపోయాయి. ట్రిపుల్ రైడింగ్ తో మరీ రెచ్చిపోయారు. రోడ్లపై బైకు రైడర్ గందరగోళం సృష్టించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ఒక చోట.. బస్సుకు సైడ్ ఇవ్వాలని కోరిన ఆర్టీసీ డ్రైవర్ పై అల్లరిమూక దౌర్జన్యం చేశారు. నగరంలో బైక్ రైడర్స్ సృష్టించిన దాష్టికం ప్రత్యక్షంగా వీడియోలు చక్కెర్లు కొడుతున్నాయి. నగరంలో ఇంత బీభత్సం జరుగుతున్నా నైట్ పెట్రోలింగ్ పోలీసులు ఏమయ్యారో ఎవరికీ తెలియని విషయం. ఈ త్రిపుల్ బైక్ రైడింగ్ లో బడాబాబుల అండ ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.