బుధవారం నెల్లూరు జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో భూ ప్రపంకపల ప్రభావం కనిపించింది. జిల్లాలోని నాలుగు మండలాలలో భూమి కంపించిందని అధికారులు ధృవీకరించారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది.
దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మర్రిపాడు మండలాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మూడు నుంచి ఐదు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూ కంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ఠం సంభవించలేదని అధికారులు తెలిపారు. గతంలోనూ పలుసార్లు నెల్లూరు జిల్లాలో పలుసార్లు భూమి కంపించింది. వరుసగా వస్తున్న ప్రకంపనలతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.